Wednesday 29 June 2016

వేయి పున్నములు

                                                                            భీమశంకరం మాస్టారు,తమ్ముడు,చెల్లెలు కుటుంబాలు వేర్వేరుగా ఉన్నా అందరూ కలిసిమెలిసి ఒకే కుటుంబంలా ఉంటారు.వీళ్ళ ముగ్గురి పిల్లలు ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రదేశాలలో ఉంటారు.ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నా సంవత్సరానికి ఒకసారి ఒక పది రోజులు అందరూ ఒకచోట కలుసుకుని అందరూ కలిసి విహారయాత్రలకు వెళ్ళి సరదాగా గడిపి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు.ఈసారి పిల్లలందరూ పెద్దవాళ్ళు ఆరుగురు తమ జీవితంలో వేయి పున్నములు(నెలకు ఒకటి,సంవత్సరానికి పన్నెండు చొప్పున ఎనభై ఐదు సంవత్సరాలు దాటినాయి కనుక వేయిపున్నములు అన్నమాట)చూసిన సందర్భంగా బంధువులందరినీ ఆహ్వానించి విందు ఏర్పాటు చేద్దామనుకున్నారు.ఈ విషయం పెద్దలకు తెలియకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.ముందే సిద్దం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఒక పెద్ద కళ్యాణమండపం తీసుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆరోజు ఉదయం పెద్దలు అందరినీ తీసుకెళ్ళి ఆశ్చర్య పరుద్దామని బంధువుల అందరి సమక్షంలో ఘనంగా సన్మానం చేశారు.బంధువులు అందరూ కూడా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మంచిదని వచ్చారు.పెద్దవాళ్ళందరి ముఖాల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం వెల్లివిరిసింది.పెద్దల సంతోషం చూచి పిల్లలు సంతృప్తి చెందారు.వచ్చిన వాళ్ళందరూ ఈ ఆలోచన బాగుంది అని పిల్లలను అభినందించారు.

No comments:

Post a Comment