Thursday 12 December 2013

హెర్బల్ టీ

తులసి టీ : 1/4 లీటర్ నీళ్ళల్లో 10 గ్రా .తులసిఆకులు వేసి మరిగించాలి. నీళ్ళు బాగామరిగిన తర్వాత పాలు 
పోసి పంచదార వేయాలి.ఇలా తయారయిన టీ త్రాగితే జలుబు,జ్వరం,కడుపులోమంట తగ్గుతుంది.
 
హెర్బల్ టీ :1/4 లీటర్ నీళ్ళల్లో కొంచెం పుదీనా,కొత్తిమీర,కరివేపాకు,ధనియాలు,అల్లం,కొంచెం టీ పొడి,జీర వేసి
మరిగించిన తర్వాత కొంచెం బెల్లం వేసి కలపాలి.ఇలా తయారయిన టీ త్రాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
అల్లం,జీరా,ధనియాలు వేయటం వలన తల త్రిప్పుట  కూడా తగ్గుతుంది.ఇది భోజనం తర్వాత త్రాగటం మంచిది.

గ్రీన్ టీ :ఒక గ్లాస్ నీళ్ళల్లో కొంచెం గ్రీన్ టీపొడి వేసి మరిగించాలి.వీటిని చల్లార్చి 1/4 నిమ్మచెక్క రసం ,పంచదార కొంచెం కలిపి త్రాగాలి.ఈ టీ గోరువెచ్చగా మాత్రమే త్రాగాలి.లేకపోతే కడుపులో మంట వస్తుంది.ఈ టీ త్రాగితే
బరువు తగ్గుతారు.గ్రీన్ టీ భోజనం తర్వాత త్రాగితే మంచిది.

No comments:

Post a Comment