Wednesday 18 December 2013

సీతమ్మ మజాకా

        లావణ్య అపార్ట్ మెంట్ లో సీతమ్మగారు ఉండేది.ఆవిడ మంచిదే కానీ పనివాళ్లకు మాత్రం ఆమె అంటే భయం.
పూజలుచేస్తూ అపార్ట్ మెంట్ లోభోజనాలు పెడుతూఉండేది.పనివాళ్లకు కూడాఅన్నీపెట్టేది.ఏది కావాలంటే అది
ఇచ్చేది.గురువారం,శుక్రవారం వచ్చిందంటే2టబ్ లనిండా ఇత్తడికుందులు వేసి తోమించేది.ఇదిగో శ్రీను ప్రసాదం
పెడతాను ఒకసారిరా అనిపిలిస్తే వచ్చేవాళ్ళు.ఇక వాళ్ళపని అయిపోయినట్లే.ఇదిగో శ్రీనుబాబు కొంచెంఅక్కడనూనె
పడిందిగానీ తుడిచెయ్ అనేది.శ్రీనుబాబు కొంచెం కొట్టుకు వెళ్లిరాఅనేది.అలా ఒక2గంటలు వాళ్ళను విసిగించేది.
ప్రసాదంమాట దేముడెరుగు ఇకరెండోసారి రాకూడదు అనుకొనేవాళ్ళు.ఇలా2,3సార్లు జరిగినతర్వాత ఆమెపిలిస్తే
ఇప్పుడే వస్తాను ఉండండి అని వాళ్ళావిడ లక్ష్మి గానీ,శ్రీనుగానీ వెళ్ళేవాళ్ళుకాదు.ఊరువెళ్ళినా వాళ్ళపిల్లలకు
బట్టలు,స్వీట్స్ తెచ్చేది. ఈమె విసిగిస్తుందని వెళ్ళడం మానేస్తే వాళ్ళింటికివెళ్లి నీకుఅదిఇచ్చాను,ఇదిచ్చాను అని
సతాయించేది.సీతమ్మా మజాకా ఈమెకు ఒక నమస్కారం పెట్టి అక్కడనుండి వెళ్ళిపోయేవారు.  

No comments:

Post a Comment