Sunday 19 October 2014

దిక్కు తోచని పరిస్థితి

                              వశిష్ట తాతగారు ఊరిలో చనిపోతే పెద్ద ఖర్మరోజు భారీగా విందు ఏర్పాటు చేశారు.భోజన సమయానికి ఎక్కడెక్కడి బంధువులు,మిత్రులు,శ్రేయోభిలాషులు వచ్చారు.కొంతమంది భోజనం చేస్తున్నారు.
కొంతమంది భోజనం చేయడానికి అప్పుడే కూర్చున్నారు.అంతవరకూ వాతావరణం ఎండతో వేడిగా ఉండి అప్పటికప్పుడు మబ్బుపట్టి అకస్మాత్తుగా భారీవర్షం పడిపోయింది.పల్లెటూరులో పెద్దపెద్ద స్థలాలు ఉంటాయి కనుక ఇంటిదగ్గర భోజనాలు పెడితే బాగుంటుందని పైన షామియానావేశారు.వర్షం పడుతుందన్నఆలోచన లేకపోవటంవల్ల అలా చేశారు.ముందుచూపుతో టార్పాలిన్ వేస్తే బాగుండేది.అది వేరే విషయం.భోజనం చేయటానికి వచ్చినవాళ్లకు   కూర్చున్నవాళ్ళకు వర్షం ఎంతకీ తగ్గకపోవడంవల్ల ఉండాలో,వెళ్ళాలో తెలియని పరిస్థితి.క్రిందఅంతాబురద,పైన షామియానాలో నుండి నీళ్ళుపడుతున్నాయి.అందరూఒకేసారి రావటంవల్ల నిలబడటానికి,కూర్చోవటానికి ఇబ్బంది.  అరగంటతర్వాత వర్షం తగ్గింది అనుకునేసరికిమళ్ళీమొదలుపెట్టింది.భోజనం చేయకుండానే కొందరు వెళ్లిపోతుంటే విందుఏర్పాటు చేసినవాళ్ళకు,మిగిలినవాళ్లకు ఏమిచేయాలో దిక్కుతోచని పరిస్థితి.బోలెడంత ఖర్చుపెట్టి చేసిన పదార్ధాలన్నీ వృధా అవటమేకాక పిలిచి అనుకున్నట్లుగా అందరికీ మర్యాద చేయలేకపోయామన్న బాధతో వశిష్ట ఇంట్లోవాళ్ళ మొహాలు నెత్తురుచుక్కలేనట్లు పాలిపోయాయి.      

No comments:

Post a Comment