Monday 20 October 2014

తాతగారికి కోపమొచ్చింది

                             అనన్య తాతగారికి తొంభై రెండు సంవత్సరాలు.అయినా తనపని తను చేసుకుంటూ  ఆరోగ్యంగా,మనుమళ్ళు,మనుమరాళ్ళకు సలహాలిస్తూ హుందాగా ఉండేవారు.ఆయనకు కోపంఎక్కువ.
 అందుకని ఎవరూ ఎదురు చెప్పేవాళ్ళు కాదు.ఒకరోజు అల్లుడికి,ఈయనకు మాటామాటాపెరిగి పెద్దాయనకు
 బి.పి పెరిగిపోయి అల్లుడిమీద అరవటం వలన తలలో నరాలు తెగిపోయి కోమాలోకివెళ్ళి మూడు రోజులకు  చనిపోయారు.పదిరోజులు క్రమంతప్పక ఆయన ఫోటోదగ్గర దీపం పెట్టిమరీ భోజనం పెట్టేవాళ్ళు.చివరిరోజు    కార్యక్రమాలన్నీచక్కగా పూర్తిచేసి,భోజనాలకు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు.అయితే ఆహడావిడిలో
 భోజనం పెట్టడం మర్చిపోయారు.ఇంతలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై భోజన సమయానికి భారీగావర్షం పడింది.చుట్టుప్రక్కల పెద్దగా వర్షం లేదు.ఇక్కడే ఇంత పెద్దవర్షం పడింది.తాతగారి ఫోటోదగ్గర భోజనం పెట్టడం మర్చిపోయారట.మాతాతగారికి కోపమొచ్చింది అని ఇద్దరు మనుమరాళ్ళు హడావిడి పడిపోయి ఒక ప్లేటులో ఆయనకు ఇష్టమైన పదార్ధాలన్నీపెట్టి కొడుకుతో తాతగారిఫోటో వద్ద పెట్టించారు.    

2 comments: