Wednesday 29 October 2014

మకరోని పాయసం

    మకరోని - 200 గ్రా.
    పాలు - 1 లీ.
    పంచదార - 1/4 కే.జి.
    జీడిపప్పు - 50 గ్రా.
    కిస్ మిస్ -  25 గ్రా.
    యాలకులు - 4
    నెయ్యి - 50 గ్రా.
    కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
                                                                    ఒక గిన్నెలో 4గ్లాసుల నీళ్ళుపోసి మరిగించి మకరోని 10 ని.లు ఉడికించి వార్చి 1స్పూను నెయ్యి వేసి కలిపితే మకరోనీ అంటుకోదు.పాన్ లో నెయ్యి వేడిచేసి జీడిపప్పు,కిస్ మిస్ వేయించి దానిలో పాలుపోసి మరుగుతుండగా మకరోనీ వేసి ఉడికిస్తే పాయసం చిక్కబడుతుండి.దించి పంచదార కలిపి,యాలకుల పొడి,తురిమిన కొబ్బరి వేసి వేడిగా సర్వ్ చెయ్యాలి.

No comments:

Post a Comment