Monday 27 October 2014

వేరుశనగ బర్ఫీ

పచ్చి వేరుశనగ పప్పు - 1 కప్పు
జీడిపప్పు - 50 గ్రా.
కిస్ మిస్  - 50 గ్రా.
పంచదార - 1/2 కే.జి
కొబ్బరి తురుము  - 1 గుప్పెడు
యాలకుల పొడి - కొంచెం
నెయ్యి - 1/2 కప్పు
కేసరి పౌడర్ -కొంచెం (ఇష్టమైతే )
                                                          వేరుశనగ గుళ్ళు 2,3 గంటలు నీళ్ళల్లో నానబెట్టాలి.జీడిపప్పు నేతిలో వేయించాలి.రెండు కలిపి మెత్తగా రుబ్బాలి.ఒక పాత్రలో పంచదార,కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి లేత తీగపాకం వచ్చినతర్వాత రుబ్బినముద్దను వేయాలి.గరిటెతో బాగా కలియబెడుతూ ఉండాలి.కొబ్బరితురుము కూడా వెయ్యాలి.మధ్యమధ్యలో నెయ్యివేస్తూ కలపాలి.కొంచెం దగ్గరపడిన తర్వాత యాలకులపొడి,కొంచెం వేయించిన జీడిపప్పు,కిస్ మిస్ వేసి బాగా కలిపి చివర్లో కేసరి పౌడర్ వేసి దించి నెయ్యి రాసిన ప్లేటులో పోసి ముక్కలుగా కట్ చేయాలి.అంతే నోరూరించే వేరుశనగ బర్ఫీ రెడీ.  

No comments:

Post a Comment