Saturday 22 August 2015

అంతరాయము కలుగకుండా..........

                                                    మీనాక్షి శ్రావణ శుక్రవారం ప్రశాంతంగా పూజ చేసుకుందామని  ఏ అంతరాయము  కలుగకుండా పనివాళ్ళందరికీ సెలవు ఇచ్చేసింది.కాసేపటికి ఒకసారి ఒక్కొకళ్ళు వచ్చి   అంతరాయం కలిగిస్తుంటారు.పని చేసేది కొంచెం,కబుర్లు ఎక్కువ.అమ్మా!తలనొప్పిగా ఉంది.ఒక్కళ్ళు కూడా సరైన   టీ ఇవ్వలేదమ్మా!కాస్త టీ పెట్టండి అనో,ఆకలేస్తుందమ్మా!అల్పాహారం సమయంలో అల్పాహారం,భోజన సమయంలో భోజనం పెట్టమనటం పరిపాటైపోయింది.ఆకలేసిన వాళ్ళకు  తినటానికి సమయానికి తగినట్లుగా ఏదో ఒకటి పెట్టాలని మీనాక్షి అమ్మమ్మచెప్పటం వలన వాళ్ళు అడగ కుండానే పెట్టే అలవాటు.అయినా అడగకుండా ఉండరు.పోనీ సరిగ్గా ఏమన్నా పని చేస్తారా అంటే అదేమీ లేదు.పైపైన పనులు వాళ్ళు చేసే కన్నా మీనాక్షి చేసే పనే ఎక్కువ.అందుకే మీనాక్షి కనీసం ఒక్క రోజైనా తనకు నచ్చినట్లుగా ఉందామని వాళ్ళందరికీ సెలవు ఇచ్చింది.ఎవరూ వచ్చి తనకు   అంతరాయము కలిగించకుండా ప్రశాంతంగా రోజంతా దైవ ధ్యానంలో మునిగిపోయింది.హమ్మయ్య!ఇన్నాళ్ళకు సంతృప్తిగా పూజ చేసుకోగలిగాను అనుకుంది.

No comments:

Post a Comment