Saturday 1 August 2015

రాతి గుండె కరిగింది

                                                                         మధుమతి గుండె బండరాయి కన్నా కఠినమైనది.మధుమతికి
పదిహేనేళ్ళ వయసులో అమ్మతో కలిసి అమ్మమ్మ ఊరునుండి వస్తుండగా ఒక విచిత్రం జరిగింది.ఎందుకో అమ్మ మనసు బాధపడి చెల్లి,నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.నేను చనిపోతున్నాను అనిచెప్పి చూస్తుండగానే నదిలో దూకేసింది.అయ్యో!అమ్మను ఆపగలిగితే బ్రతికేది కదా!అన్న బాధ కించిత్తు కూడా లేదు.ఎప్పుడూ చదువుకో అంటుందని అమ్మ మీద కోపం అందుకే పోతేపోయిందిలే అనుకున్నానంటుంది.కాలక్రమంలో ఎలాగో పెళ్ళయినా మార్పులేదు.చరిత్ర పునరావృతమైనట్లు పదిహేనేళ్ళ కూతురు చదువుకోమంటే చస్తానంటుంది.నువ్వు చచ్చినా బతికినా నాకనవసరం నేను చెప్పిందే వేదం అంటుంది మధుమతి.ఈరెండు మచ్చుతునకలు మాత్రమే.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇంతటి రాతిగుండెను అబ్దుల్ కలామ్ గారి మరణం కదిల్చింది.ఆయన మరణవార్త తెలియగానే మధుమతి వెక్కివెక్కి ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు?అంటే నాకు  అబ్దుల్ కలాం అంటే చాలా ఇష్టం అందుకే ఏడుపొచ్చింది అంటూ రెండు  రోజులవరకూ గుర్తొచ్చినప్పుడల్లా కన్నీరు పెడుతూనే ఉంది.ఓర్నీ!కలాం మరణం రాతిగుండెను కూడా కరిగించినదన్న మాట.కలాం జీ సదా చిరస్మరణీయుడే అయినా ఇది విచిత్రం. 

No comments:

Post a Comment