Wednesday 5 August 2015

ఇంటి యజమానిని పిలువు

                                                              మంజరి,శివరామ్ భార్యాభర్తలు.ఇద్దరూ వృత్తిరీత్యా వైద్యులు.విదేశాలలో స్థిరపడ్డారు.ఇద్దరికీ తోటపని అంటే చాలా ఇష్టం.ఒక పదిఎకరాల పొలంకొని అందమైన ఇల్లు కట్టుకుని దానిచుట్టూ రకరకాల అరుదైన మొక్కలతో తోటను ఏర్పాటు చేసుకున్నారు.స్వతహాగా శివరామ్ కి వ్యవసాయం అంటే చాలా ఇష్టం.ట్రాక్టరు,భూమిని   దున్నే యంత్రాలతో సహా అన్ని పనిముట్లు కొని దానికొక షెడ్డు వేసి ప్రత్యేకంగా అందులో పెడతారు.సాయంత్రం ఇంటికి రాగానే ఇద్దరూ స్వయంగా తోటపనికి అవసరమైన సామాన్లు తీసుకుని తోటపని మొదలుపెడతారు.వీళ్ళు ఇల్లు కట్టుకున్నప్పట్లో అక్కడ ఎక్కువ ఇళ్ళు ఉండేవి కాదు.నాలుగురోడ్ల కూడలికి దగ్గర  కనుక వచ్చేపోయే వాళ్ళకు ఇల్లు కనిపించేది.కొంతమంది ఆగి మరీ చూచి వెళ్ళేవాళ్ళు.ఒకసారి ఒక కుటుంబం వచ్చి తోటలో పని చేసుకుంటున్నశివరామ్ ని పిలిచి ఇంటి యజమానిని పిలువు అన్నారు.అంతకు ముందే వర్షం పడటంతో శివరామ్ చేతులకు,బట్టల నిండా అక్కడక్కడా మట్టి అంటింది.నేనే ఇంటి యజమానిని అని వాళ్ళతో చెప్పేసరికి చాలా ఆశ్చర్యపోయారు.మీఇల్లు.తోట చాలా బాగున్నాయి.ఒకసారి మీతోట మొత్తం చూద్దామని వచ్చామన్నారు.సరే,చూడండి అని మొత్తం తిప్పి చూపించాడు.రకరకాల రంగుల పువ్వులతో ,ఒకటి ఉండి ఇంకొకటి లేదు అనుకోకుండా అన్ని రకాల పండ్ల మొక్కలు,కూరగాయల మొక్కలు,క్రోటన్స్ అందంగా కత్తిరించి చూడటానికి తోట ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

No comments:

Post a Comment