Saturday 8 August 2015

నైజం

                                                                       మోహన్ పెద్ద జిత్తులమారి.అమ్మా!నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూస్తాను నాదగ్గరే ఉండు అని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళి ఆమె దగ్గర ఆస్తి మొత్తం తన పేరు మీద వ్రాయించుకున్నాడు.కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు.వాళ్ళు పెళ్లిళ్లకు వెళ్తూ అమ్మను వెంటబెట్టుకుని వెళ్ళకుండా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఇంటికి కాపలా మనిషిని చేశాడు.ఇంట్లోపని మొత్తం అమ్మే చేస్తుంది.అమ్మకు ఎప్పటినుండో నడుము నొప్పిగా ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఏదోఒకటి తాత్కాలికంగా మందు తీసుకొచ్చి ఇస్తున్నాడు.మరీ నొప్పి ఎక్కువయ్యేసరికి వైద్యుని దగ్గరకు తీసుకెళ్తే నడుముకు ఆపరేషన్ చెయ్యాలన్నారు.అమ్మ దగ్గర మొత్తం డబ్బు తీసేసుకున్నాడు కనుక తన చేతి డబ్బు ఖర్చు అవుతుందని అమ్మకు ఆపరేషన్ అంటే భయం.అందుకని ఏమి చెయ్యాలా?అని ఆలోచిస్తున్నాను అని అందరికీ చెపుతున్నాడు.చివరకు ఆపరేషన్ చెయ్యనక్కరలేదు. మందులు వాడుకుంటే సరిపోతుందన్నారు అని చెప్పాడు.పాపం అమ్మ నిజమే అని నమ్మింది.అబద్దాన్ని కూడా నిజమని నమ్మించడం మోహన్ నైజం.మోహన్ కు అది వెన్నతో పెట్టిన విద్య.పుట్టిన బిడ్డల్లో అందరికన్నా ఇష్టమైన మోహన్ అబద్దం చెప్పినా నిజమేనని నమ్మటం మోహన్  అమ్మ నైజం.  

No comments:

Post a Comment