Friday 28 August 2015

రావమ్మా మహాలక్ష్మి

                                                లక్ష్మిదేవి అలంకార ప్రియురాలు.వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటిని మామిడితోరణాలతో, రకరకాల రంగుల పువ్వులతో,పూదండలతో ఎంత అందంగా అలంకరిస్తే అంత శుభం జరుగుతుందని నమ్మకం. ప్రత్యేకించి చామంతి పువ్వులతో అమ్మవారికి పూజ చేయడం ఆచారం.ఐదు రకాల పువ్వులు,ఐదురకాల పండ్లు ఐదు రకాల పిండి వంటలు తప్పనిసరి.ఆపై ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు.వాయనానికి తొమ్మిది పోగుల తోరము,తొమ్మిది పూర్ణాలు తప్పనిసరి.నిష్కల్మషంగా,నిర్మలమైన మనస్సుతో మా ఇంటికి రావమ్మా మహాలక్ష్మీ అంటూ మనస్పూర్తిగా ఆహ్వానించి లక్ష్మిదేవిని పూజిస్తే అంతా శుభమే.మహాలక్ష్మి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.స్త్రీలు సౌభాగ్యంగా ఉండాలని,తన కుటుంబం ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో తులతూగాలని భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.ఈ వ్రతంలో లక్ష్మీపార్వతుల సమన్వయం కనిపిస్తుంది.స్త్రీలు ఒకరికొకరు సఖ్యతతో ఎలా ఉండాలో తెలియచెప్పే వ్రతం.తోటి వారంటే గౌరవం,ప్రేమ ఉండి అందరితో సత్సంబంధాలు కలిగి సంతోషంగా ఉండేవారి దగ్గర, డబ్బును గౌరవించి,పూజించి,విలువ తెలిసిన వాళ్లదగ్గర మాత్రమే లక్ష్మీదేవి కలకాలం నిలుస్తుంది.డబ్బంటే నిర్లక్ష్యం అసలు ఉండకూడదు.అందరి దగ్గర లక్ష్మీదేవి కలకాలం ఉండాలని,అమ్మ అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్ధిద్దాము.

No comments:

Post a Comment