Friday 5 December 2014

పాదాలు నొప్పులు,అలసట తగ్గటానికి .........

                          మనం రోజంతా హడావిడిగా తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉంటాము.మనశరీరం బరువు
మొత్తం కాళ్ళతోపాటు పాదాలపై పడుతుంటుంది.కనుక కాళ్ళ నొప్పులతో పాటు,పాదాల నొప్పులు వస్తుంటాయి.
అందుకని మనకు వీలయినప్పుడు ఏదోఒక సమయంలో పాదాలకు విశ్రాంతినిచ్చికుర్చీలో కూర్చుని రెండు చిన్న
ప్లాస్టిక్ టబ్ లేదా బకెట్ లు తీసుకోవాలి.పాదాలు మునిగేలాగా ఒకదానిలో గోరువెచ్చనినీళ్ళు,ఒకదానిలోమామూలు నీళ్ళు తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళల్లో చారెడు ఉప్పు వేసి పాదాలు మునిగేలా పెట్టాలి.ఒక 5 ని.ల తర్వాత తీసేసి మాములు నీళ్ళల్లో ఒక 5 ని.లు పెట్టాలి.ఇలా మార్చిమార్చి రెండుసార్లు చేయాలి.ఇలాచేస్తే పాదాలకు అలసట లేకుండా,నొప్పులు తగ్గిపోతాయి.పాదాలనొప్పులు వచ్చిన తర్వాత ఇబ్బందిపడేకన్నారాకముందు నుండే ఇలా చేస్తుంటే పాదాలనొప్పులు రాకుండా ఉంటాయి.దీనిలో ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. పది ని.లు ఉప్పునీళ్ళల్లో నానటంవల్ల పాదాలు పైన,అడుగున కూడా శుభ్రపడి పగుళ్ళు రాకుండా ఉంటాయి.        

No comments:

Post a Comment