Sunday 13 September 2015

ఇనుము లోపించడం వల్ల..........

                                                                   శరీరంలో ఇనుము లోపించడం వల్ల రక్తహీనత వస్తుంది.దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి.గర్భిణీ స్త్రీలలో రక్తహీనత వల్ల రక్తం గడ్డ కట్టి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ప్రాణానికే ప్రమాదం వస్తుంది.మామూలు వాళ్ళల్లో కూడా రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంవల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అందువల్ల ప్రతి ఒక్కరు రక్తహీనత లేకుండా ముందే జాగ్రత్త వహించాలి.ఇనుము ఎక్కువగా ఉండే తోటకూర,గోంగూర,మునగాకు,పాలకూర తదితర ఆకుకూరలు రోజూవారీ ఆహారంలో భాగంగా  ఏదోఒక రూపంలో తింటూ ఉండాలి.పళ్ళు,కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.ఈ విధంగా చేయటం వల్ల రక్తహీనత దరిచేరకుండా ఉంటుంది.దీనికి తోడు ఎప్పటికప్పుడు రక్తపరీక్ష చేయించుకుని సరిపడా రక్తం ఉందో లేదో చూచుకుంటూ ఉండాలి.

No comments:

Post a Comment