Tuesday 29 September 2015

బాల్యమే పునాది

                                                                  కొంతమంది పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు.బాల్యంలో ఒత్తిడికి గురయితే పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఆందోళన లేకుండా ఉండటానికి చిన్నప్పటి నుండి యోగా,ధ్యానం అలవాటు చేయాలి.మైదానంలో ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి.చిన్నప్పటి నుండి చక్కటి ఆహార పద్ధతి అలవాటు చేయాలి.ఫాస్ట్ ఫుడ్ సాధ్యమైనంత దూరంగా ఉంచి పండ్లు,కూరగాయలు ఇష్టంగా తినేట్లు చూడాలి.పిల్లలు మైనపు ముద్దలు.మనం ఏరకంగా తయారు చేస్తే అదే రకంగా తయారవుతారు.చిన్నప్పటి నుండి పిల్లలను అతి గారాబం చేయకుండా మంచి పద్దతులు అలవాటు చేస్తే ఆరోగ్య పరంగానూ,చదువు పరంగాను అన్ని విధాలా మంచి పౌరులుగా ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు.అతి క్రమశిక్షణతో ఉన్నా మొండిగా తయారవుతారు.కనుక కౌమారంలో పిల్లల దగ్గర నొప్పింపక తానొవ్వక అన్న తీరులో పెద్దలు కూడా ఉండాలి.శారీరకంగా,మానసికంగా కూడా ఆరోగ్యవంతమైన బాల్యమే చక్కటి జీవితానికి పునాది. 

No comments:

Post a Comment