Sunday 6 September 2015

పార్శ్వపు నొప్పి

                                                             శ్రీవల్లి విపరీతమైన తలనొప్పితో బాధపడుతుండేది.వెలుతురు చూడలేక 
పోయేది.తలుపులన్నీ వేసేసి చీకటి గదిలో పడుకునేది.విపరీతమైన వాంతులు,ఏపనీ చేయగలిగేది కాదు.ఎందరు వైద్యులను సంప్రదించినా,ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోయింది.శ్రీవల్లి బాధ చూడలేక ఆమె స్నేహితురాలు ఒక ఆయుర్వేద వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళింది.తలకు ఏదో ఒక వైపు మాత్రమే విపరీతమైన నొప్పి వస్తుందని తను పడుతున్నఇబ్బందులన్నీఏకరువు పెట్టింది శ్రీవల్లి. దేశవాళీ ఆవు పెరుగు తోడుపెట్టి,కవ్వంతో చిలికి,చేతితో వెన్న తీసి కరిగించిన స్వచ్చమైన నెయ్యి రెండు చుక్కలు చొప్పున రెండు ముక్కులలో కొద్ది రోజులు వేసుకుంటే తప్పకుండా తగ్గిపోతుందని చెప్పారు.ఎంత తలనొప్పి ఉన్నా ఆవునేతి చుక్కలు వేసుకున్న గంటలో తగ్గిపోతుందని చెప్పారు.శ్రీవల్లి ఆయన చెప్పిన విధానాన్ని తు.చ తప్పకుండా పాటించి పార్శ్వపు నొప్పి నుండి విముక్తి పొందింది. 

No comments:

Post a Comment