Sunday 20 September 2015

నా పరిస్థితి ఏమిటి?

                                                                    ఈశ్వరరావు వయసులో ఉండగా కష్టపడి వ్యవసాయం చేసేవాడు.
ఆ నేపధ్యంలో ఒకరోజు పొలం నుండి వరిగడ్డి ఇంటికి తోలుకొస్తుండగా ఎద్దులబండి పై నుండి పడిపోయి నడుముకు  దెబ్బ తగిలి కాళ్ళు చచ్చుబడి పోయాయి.అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఇంట్లో ఉండే పనివాళ్ళకు పనులు పురమాయించేవాడు.తన పనులు తనే చక్రాల కుర్చీ తయారు చేయించుకుని చేసుకునేవాడు.భార్య కూడా సహనంతో భర్త పనులన్నీ తనే స్వయంగా పర్యవేక్షించేది.అలా పాతిక సంవత్సరాలు గడిచిపోయాయి.ఈమధ్య భార్యకు గుండెజబ్బు వచ్చింది.శస్త్ర చికిత్స చేయించుకుని ఆమె బాగానే ఉన్నాభార్య చనిపోతుందేమోనని బెంగ పట్టుకుంది.దానికి తోడు కోడలికి కూడా అనారోగ్యంగా ఉండటంతో మీరిద్దరూ చనిపోతే నా పరిస్థితి ఏమిటి?అని అప్పుడప్పుడు భార్య దగ్గర అనటం మొదలు పెట్టాడు.భార్య కూడా అన్నిపనులు చేయలేక పోతుంటే ఈశ్వరరావు పనులే కాక ఇంటి పనుల నిమిత్తం కూడా కొడుకు ఒక మనిషిని పెట్టాడు.వాడు మొక్కల్లో కలుపుమొక్కలు బాగా ఉన్నాయని మందు కొనుక్కొచ్చి గూట్లో పెట్టాడు.అది ఈశ్వరరావు కంటపడింది.ఎవరూలేని సమయం చూచి మనవడు అటుగా వెళ్తుంటే అరేయ్!ఆడబ్బా ఇటివ్వరా!అంటే వాడు తెలియక తెచ్చి ఇచ్చాడు.రాత్రి అందరూ నిద్ర పోయిన తర్వాత దాన్ని తాగేసి తెల్లారేసరికి చనిపోయిఉన్నాడు.భార్య వచ్చి పిలిస్తే పలకక పోయేసరికి వామ్మో!ఎంతపని చేశాడు?అనుకుని చనిపోయాడని నిర్ధారించుకుని ఏడుస్తూ అందరినీ పిలిచింది.కాళ్ళు పనిచేయకపోయినా పెద్దపులిలాగా వాకిట్లో కూర్చుని వచ్చేపోయే వారిని నోటారా పలకరించేవాడు.అకస్మాత్తుగా చనిపోయేసరికి నోటమాట రాక అందరి మనసులు భాదపడ్డాయి.

No comments:

Post a Comment