Wednesday 18 June 2014

నువ్వెవడివిరా?

       లత,వీణ తండ్రి రామేశ్వరరావు చనిపోయారు.మగపిల్లలులేని కారణంగా తమ్ముడు కర్మకాండ      చేద్దామనుకున్నాడు.తండ్రి శవంతో పాటు స్మశానానికి లత,వీణ కూడా వెళ్ళటానికి బయలుదేరారు.
 హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళు స్మశానానికి వెళ్ళకూడదని అందరూ చెప్పినా వినకపోతే
 ఒకపెద్దాయన ఆపటానికి లత చెయ్యిపట్టుకున్నాడు.ఏమిమాట్లాడుతుందో తెలియనిస్థితిలోఆయన్ని
"నువ్వెవడివిరా?నన్నుఆపటానికి మానాన్న నన్నే అంతా చెయ్యమన్నాడు"అనేసింది.అంతమాట
అన్నతర్వాత వద్దనటం కూడా అనవసరమని వదిలేశారు.అక్కచెల్లెళ్ళు ఇద్దరు చెరొకప్రక్క పాడె
పట్టుకున్నారు.స్మశానానికి వెళ్ళిన తర్వాతకూడా తమ్ముడు చితి వెలిగిస్తే కొంచెం వెలిగి ఆగిపోతే
అక్కాచెల్లెళ్ళు చెరొక అగ్గిపుల్ల వెలిగించివేశారు.అప్పుడు చితి అంటుకుంది.


























































































No comments:

Post a Comment