Wednesday 11 June 2014

చక్రపొంగలి

          బియ్యం -4 కప్పులు
         పెసరపప్పు-1కప్పు
          బెల్లం -5కప్పులు
          నెయ్యి -మెతుకు చేతికి అంటకుండా పట్టినంత
          ఎండుకొబ్బరి-  ఒక చిప్ప
         జీడిపప్పు,కిస్మిస్
               బియ్యము,పెసరపప్పు కలిపి 8కప్పుల నీళ్ళుపోసి ఉడికించాలి.దానిలోబెల్లం పెట్టి ఇగిరిన తర్వాత నెయ్యి వేయాలి.ఎండుకొబ్బరి సన్నగా ముక్కలుకోసుకుని నేతిలోవేయించాలి.జీడిపప్పు,కిస్మిస్ నేతిలో  వేయించి అన్నీకలిపి ఒక్కసారి కలిపితే చక్రపొంగలి రెడీ.ఇష్టమైన వాళ్ళు కొంచెం పచ్చకర్పూరం వేసుకోవచ్చు.   

No comments:

Post a Comment