Friday 20 June 2014

మైసూర్ పాక్

             శనగపిండి(బేసన్) -1కప్పు
             పంచదార  -1 1/2 కప్పు
            నెయ్యి -1 1/4 కప్పు
             
                శనగపిండి ఉండలు లేకుండా వేయించాలి.పంచదారలో కొంచెంనీళ్ళు పోసి పాకం నీళ్ళల్లో నిలిచి చుడితే గుండ్రంగా అవ్వాలి.అప్పుడు నెయ్యివేస్తూ పిండివేసి త్రిప్పాలి.ఈమిశ్రమం బాగా పొంగుతున్నప్పుడు నెయ్యి రాసి
పెట్టుకున్న ప్లేటులో పోసి మనకు నచ్చినట్లుగా ముక్కలు కట్ చెయ్యాలి.
గమనిక: మిశ్రమం మరీ ఎక్కువ త్రిప్పితే పొడి అవుతుంది.తక్కువత్రిప్పి పోస్తే పొంగకుండా పలుచగా వస్తుంది.
అందుకని సరైన సమయంలో ప్లేటులో పొయ్యాలి.చాలా బాగా వస్తుంది.

1 comment:

  1. మీ బ్లాగును బ్లాగ్ వేదికలో చేర్చండి.
    http://blogvedika.blogspot.in/

    ReplyDelete