Monday 30 June 2014

బొగుడు

            సరోజాదేవిగారు అరవై సంవత్సరాలవరుకు తను,తనపిల్లలదే పైచేయిగా ఉండాలని పోరాడిన ఆమె.ఆమెకు
అకస్మాత్తుగా ఒకసారి భగవంతుడు కలలో కనిపించి నీదారి మళ్ళించి ఇకనుండి జ్ఞానసముపార్జన చేయిఅన్నాడట.
ఇక అప్పటినుండి ధ్యానం చేసుకుంటూ జ్ఞానం కోసం గ్రంధాలు చదవటం మొదలుపెట్టింది.ఆ గ్రంధాలలో అమృతం
ఉంది అనేది.ఒకపూట భోజనం,రాత్రికి ఒకపండు,పాలు తీసుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాలనుండి గ్రంధాధ్యయనం చేస్తుంది.పుస్తకాలు,గ్రంధాలూ చదవటం వలన జ్ఞానవృద్ధి కదా!అందుకే ఆమె జ్ఞానిలాగానే కనిపిస్తుంది.ఇంతలో అనుకోకుండా ఆమె కొడుకు చనిపోయాడు.ఎవరికయినా మరణం సహజమని జ్ఞానిగా తెలిసినా తల్లిమనసు తల్లడిల్లి
ఇంత వయసున్న నన్ను వదిలేసి భగవంతుడు వాడిని తీసుకెళ్ళడమేమిటని దిగులుపడింది.చిక్కిశల్యమై బొగుడు
అంటే ఎముకలగూడులాగా తయారయింది.అందరికీ ఎన్నోచెప్పే ఆమె అలాఅవటం చూపరులకు బాధ కలిగింది.

No comments:

Post a Comment