Monday 9 June 2014

స్థపతి

                                            స్థపతి అంటే శిల్పి.విజయవాడకు దగ్గరలోని ఒకఊరిలో పాతరామాలయం స్థానంలో    నూతనరామాలయాన్ని నిర్మించారు.స్థపతి తన శిల్పకళాచాతుర్యంతో విగ్రహాలను,ఆలయగోపురాన్ని,గోపురం పైన ఉన్నవిగ్రహాలను జీవకళ ఉట్టిపడేలా తయారు చేశారు.ఆలయ పునర్నిర్మాణానికి ముందు ఆఊరిపెద్దాయనకు కలలో శ్రీరాముడే స్వయంగా కన్పించి ఆలయాన్ని పునరుద్ధరించమని చెప్పారని తను పెద్దమొత్తంలో డబ్బుఇచ్చి
ఊరివారందరి సహకారం కావాలని చెప్పారు.ఊరిలోవాళ్ళు,విదేశాలలో ఉన్నవాళ్ళు ఎవరికివాళ్ళు స్వచ్చందంగా
ఇచ్చిన డబ్బుతో ఆలయనిర్మాణానికి నడుం బిగించారు.పెద్దాయన స్వయంగా ఆలయనిర్మాణాన్నిదగ్గరుండి పర్యవేక్షించారు.ఊరిలో ఉన్నకుర్రాళ్ళందరు వీలయినప్పుడల్లా ఆలయనిర్మాణ పనులుచూసేవారు.ఆలయ
ప్రారంభోత్సవం సందర్భంగా స్థపతిని,వాస్తుశిల్పిని,వేదపండితులను,దీక్షతీసుకుని మూడురోజులు పూజలుచేసిన
దంపతులను పెద్దాయన సత్కరించారు.ఎంతో ఘనంగా ఆలయ ప్రారంభోత్సవం జరిగింది.ఇంకొక ముచ్చటగొలిపే
విషయమేమిటంటే ఇవన్నీ చూస్తూ స్థపతి ఆరేళ్ళకుమారుడు కొంచెంపువ్వులు,అక్షింతలు తీసుకుని తండ్రి పాదాలపై వేసి నమస్కరించాడు.అది చూచి అందరూ ముచ్చటపడ్డారు.     

No comments:

Post a Comment