Sunday 10 August 2014

తనదాకా వస్తే కానీ.....

                 సందేశ్,భార్య ఇద్దరిదీ స్వార్ధపూరిత మనస్తత్వం.ఎంతసేపూ వాళ్ళ పబ్బం గడుపుకోవటం,వాళ్ళ స్వార్ధం తప్ప ఎదుటివాళ్ళకు ఇబ్బంది అనే ఆలోచన ఉండదు.సందేశ్ అక్కఇల్లు సందేశ్ ఇంటికీ,సందేశ్ పిల్లల స్కూలుకు మధ్యలో ఉంటుంది.ప్రొద్దున పిల్లలను తీసుకొచ్చి,సాయంత్రం స్కూలు అయిపోయిన తర్వాత రాత్రికి కూడా భోజనం చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళు.వాళ్ళతోపాటు మందీమార్బలము,పాలేళ్ళు కూడా అక్క ఇంట్లోనే భోజనానికి ఉండేవాళ్ళు.
అక్కపిల్లలకు పబ్లిక్ పరీక్షలప్పుడు కూడా ఇదే తంతు.సందేశ్ఎవరూ ఏమీ అనకుండానే పబ్లిక్ పరీక్షలయితే ఏమయింది? అంత ఇల్లుంది పిల్లలు ఏదో ఒక గదిలో కూర్చుని చదువుకోవాలి గానీ ఇంటికి చుట్టాలు రాకుండా ఉంటారా? అనేవాడు.తన పిల్లల మాములు పరీక్షలకు కూడా సందేశ్ భార్య హంగామా చేసి ఇంటికి ఎవరూ రాకూడదు అంటుంది.ఇక కూతురుకి పబ్లిక్ పరీక్షలని సంవత్సరమంతా బంధువులు ఎవరూ మాఇంటికి రావద్దు అని నిర్మొహమాటంగా ఒక ఫంక్షన్లో ప్రకటించింది.సందేశ్ కూడా ఏమీ మాట్లాడలేదంటే అతని ఉద్దేశ్యం కూడా అదే
కనుక తనదాకా వస్తే కానీ తెలియలేదా?పిల్లల పరీక్షలప్పుడు కూడా అక్క ఇంట్లో భార్యాపిల్లలతో కూర్చునేవాడు.
ఎదుటివాళ్లకు ఇబ్బంది అనే ఆలోచన రాదు ఇప్పుడు వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి వెధవ ఓవర్ యాక్షన్లు
అని బంధువులందరికీ విచిత్రంగా ఉంది.

No comments:

Post a Comment