Monday 25 August 2014

పనస తొనలు

        మైదా  - 1/2 కే.జి
       పంచదార - 1/4 కే.జి
       వెన్న లేక నెయ్యి -  100 గ్రా
      నూనె - వేయించటానికి సరిపడా
                            మైదాలో వెన్న లేక నెయ్యి వేసి నీళ్ళుపోసి గట్టిగా కలపాలి.పిండిపై ఒక క్లాత్ తడిపి వేసి అరగంట నాననివ్వాలి.తర్వాత కొంచెం పిండిని గుండ్రంగా చేసి పూరీలాగా వత్తి చాకుతోగానీ,చక్రంఉన్న స్పూనుతోగానీ మధ్యలో నిలువుగా కట్ చేసి అటు చివర ఇటు చివర పూరీని పట్టుకుని ఒకసారి మెలిత్రిప్పాలి.అప్పుడు పనసకాయ
ఆకారం వచ్చి లోపల తొనలు ఉన్నట్లుగా కట్ చేసినవి విడివిడిగా వస్తాయి.అటు ఇటు మెలిత్రిప్పటం వలన కాయలోపల తొనల్లాగా ఉంటుంది.బాండీలో నూనె పోసి కాగినతర్వాత కొన్నికొన్ని వేసివేయించి ప్రక్కన పెట్టుకోవాలి.
ఈలోపు పంచదారలో కొంచెం నీరుపోసి ఉండ పాకం దగ్గర పడేటప్పుడు వేయించిన పనసతొనలు వెయ్యాలి.అవన్నీ తీసి ఒకప్లేటులో పెట్టుకోవాలి.నోరూరించే,రుచికరమైన పనసతోనలు రెడీ.ఇవి పదిరోజులు నిల్వ ఉంటాయి.కంటికి
ఇంపుగా కూడా ఉంటాయి.   

No comments:

Post a Comment