Friday 8 August 2014

మూర్తి గారింట్లో వరలక్ష్మీ వ్రత సందడి

                మూర్తిగారి భార్య లక్ష్మీదేవి.పేరుకు తగ్గట్లే లక్ష్మీదేవిలా కళకళలాడుతూ మెడనిండా నగలతో,ఎప్పుడూ పట్టుచీర ధరించి కనిపించిన వాళ్ళను నవ్వుతూ నోటారా పలకరిస్తూ సందడిగా ఉంటుంది.వీళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు,ఒక మగపిల్లవాడు.అందరికీ పెళ్ళిళ్ళయి విదేశాలలో పిల్లాపాపలతో సుఖంగా,సంతోషంగా ఉన్నారు. మనవళ్ళు,మనవరాళ్ళు పుట్టినప్పుడల్లా విదేశాలకు వెళ్ళివస్తూ పెద్దవాళ్ళు సంతోషంగా ఉన్నారు.ప్రతిసంవత్సరం
శ్రావణ మాసం వచ్చిందంటే వీళ్ళింట్లో సందడే సందడి.ముగ్గురు ఆడపిల్లలు,కోడలు,లక్ష్మీదేవిగారు అందరూ బ్రాహ్మణుడ్ని పిలిచి శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం చేయించుకుంటారు.బంధుమిత్రులందరినీ పిలిచి విందుభోజనాలు
ఏర్పాటు చేస్తారు.వరలక్ష్మీ వ్రతం చేసుకోవటానికి ప్రతిసంవత్సరం విదేశాల నుండి కూతుళ్ళు,కోడలు తప్పనిసరిగా వస్తారు.పెద్దవాళ్ళు ఉన్నంతవరకు భారతదేశంలోనే చేసుకోవాలని లక్ష్మీదేవి,మూర్తిగార్ల కోరిక.అదే పిల్లలు తు చ
తప్పకుండా పాటిస్తున్నారు.పండుగ వచ్చినా నలుగురు పిల్లలు విదేశాలలో ఉన్నా ఎవరో ఒకరి ఇంట్లో అందరూ కలిసి జరుపుకుంటారు.

No comments:

Post a Comment