Monday 11 August 2014

కజ్జి కాయలు

        బొంబాయిరవ్వ - 1 కే.జి
        పుట్నాల పప్పు - 1/2 కే.జి
        ఎండు కొబ్బరి - 1/4 కే.జి
        పంచదార - 2 1/2కే .జిలు
        గోధుమ పిండి - 1/2 కే .జి
       మైదా - 1/2 కే.జి
       నెయ్యి - తగినంత
      యాలకుల పొడి - తగినంత
                     బొంబాయి రవ్వ  నెయ్యి వేసి దోరగా వేయించాలి.పుట్నాలపప్పు రవ్వగా ఉండేలాగా మిక్సీలో చెయ్యాలి.ఎండుకొబ్బరి తురుముకుని ఉంచాలి.వీటన్నీ కలిపి ఎంత బరువు ఉంటే అంత పంచదార వెయ్యాలి.
పై పిండి అంటే మైదా,గోధుమ పిండిలో నెయ్యివేసి కొంచెంసేపు నాననివ్వాలి.కొంచెం పిండిని పూరీలాగా చేసి
కజ్జికాయల చెక్కకు నూనె రాసి దానిలో పూరీపెట్టి రెండు స్పూనుల పిండివేసి పూరీకి పైన నొక్కే చోట నీళ్ళు రాయాలి.చెక్కను నొక్కి ఎక్కువ ఉన్న పూరీ తీసేయ్యాలి.కజ్జికాయ ఆకారంలో వస్తుంది.దీన్ని తీసి ఒక పేపరుపై   వేసుకోవాలి.చెక్కకు ప్రతిసారీ నూనె రాయాలి.అన్నీచేసి పెట్టుకుని బాండీలో నూనె తగినంత పోసి కాగాక ఒక్కొక్కటి
వేయించి పేపరు మీద పెట్టుకుని ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి.పదిరోజులు నిల్వ ఉంటాయి.పై కొలతలలో మనకు కావలసినంత చేసుకోవచ్చు.ఇష్టమైన వాళ్ళునువ్వులు,గసాలు కూడా వేయించుకుని వేసుకోవచ్చు.కానీ
వారంతర్వాత నూనె వాసన రావచ్చు.జీడిపప్పు చిన్నముక్కలు వేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. 

No comments:

Post a Comment