Tuesday 10 March 2015

వేసవిలో చర్మసంరక్షణ

                                                 వేసవిలో శీతల పానీయాలకు ప్రాధాన్యం తగ్గించి తాజాపండ్ల రసాలు,ఎక్కువగా  మంచి నీళ్ళు తాగాలి.దీనివల్ల చర్మం తాజాగా,మృదువుగా ఉంటుంది.సబ్బు వాడకం,ఫేస్ వాష్ వాడకం తగ్గించాలి.
 ఎండలో వీలైనంత వరకు బయటికి వెళ్ళక పోవడం మంచిది.ఎండలోకి వెళ్లేముందు చర్మ కణాలు దెబ్బతినకుండా  
 ముఖానికి,మెడకు,చేతులకు సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాయాలి.చన్నీటి స్నానం మంచిది లేదంటే  గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.వేడినీళ్ళతో చేయకూడదు ఎందుకంటే చర్మం పేలి కందిపోతుంది.ఆకుకూరలు,  మామిడిపండ్లు కూడా వేడి కనుక ఇష్టమని ఎక్కువ తినకుండా  సపోటా,ఆపిల్,స్ట్రాబెర్రీ వంటి పండ్లు తినాలి.నిమ్మరసం,మజ్జిగ ఎక్కువగా  తీసుకోవాలి .ఎండు కర్జూరాలు,సబ్జా గింజలు నీళ్ళల్లో నానబెట్టి ఆనీరు తాగాలి.తాటి ముంజెలు తింటే మంచిది.  చర్మంపై ఎర్రబడితే తాటి ముంజెల్లోని నీళ్ళురాస్తే తగ్గిపోతుంది. చలువ చేసే పదార్ధాలు తీసుకోవటం వల్ల చర్మంపై వేసవిలో వచ్చే దద్దుర్లు,పేలుడు రాకుండా ఉంటుంది.కంటినిండా నిద్రపోవాలి.రోజు కాసేపు వ్యాయామం చేయాలి.రక్తప్రసరణ మెరుగుపడుతుంది.బయట ఎండగా ఉంది కదాని  ఎప్పుడూ చల్లదనంలో కుర్చోకూడదు.చర్మం పొడిబారుతుంది.ఇది మాకు తెలియదా ఏంటి ?అనుకోకండి.వారానికి రెండుసార్లు నలుగు పెట్టుకుంటే వేసవి కాలంలో కంటికి కనిపించని మురికి వదిలిపోయి చర్మం నునుపుగా బాగుంటుంది.ఇక చర్మ సంరక్షణ మన చేతుల్లోనే ఉంది. 

No comments:

Post a Comment