Monday 30 March 2015

పాతిక ఏళ్ళనాటి మొక్కు

                                                 స్వప్న బంధువులు ఉద్యోగరీత్యా అరుణాచలప్రదేశ్ లో ఉంటారు.స్వంత ఊరిలో
రామాలయంలో నలుగురు అన్నదమ్ములు,తల్లిదండ్రులతో సహా ఐదుజంటలు పీటలమీద కూర్చుని సీతారాముల కళ్యాణం జరిపించి ఘనంగా ఊరంతా భోజనాలు పెట్టారు.ఇది పాతిక ఏళ్ళనాటి మాట.ఈనేపధ్యంలో స్వప్నమేము కూడా సీతారాముల కళ్యాణం చేయించి భోజనాలు పెట్టుకుంటే బాగుంటుందని మనసులో అనుకుంది.చేద్దాం,చేద్దాం అనుకుంటూనే ఆవిషయం మర్చిపోయింది.పాతిక ఏళ్ల తర్వాత స్వయంగా రామయ్య తండ్రే కబురుపంపినట్లుగా దూరపుబంధువు ఒకాయన కళ్యాణం దగ్గర కూర్చుంటారా?అని అడిగితే సరే అన్నారు కానీ అప్పటికీ స్వప్నకు గుర్తు రాలేదు.చాలామంది ఉండగా ఇంత దూరంలో ఉన్న మనల్ని అడగటంలో అంతరార్ధం ఏమిటా?అని ఆలోచించగా స్వప్నకు చప్పున తన మొక్కు సంగతి గుర్తొచ్చింది.అయ్యో!ఇన్నిఏళ్ల నుండి మర్చిపోయాను.ఇప్పటికైనా మించిపోయింది లేదని సంతోషంగా ఏర్పాట్లు చేసుకుని అందరూ కలిసి ఘనంగా సీతారాముల కళ్యాణం జరిపించి,భోజన ఏర్పాట్లు చేశారు.సీతారాముల కళ్యాణము చూతము రారండి అన్నట్లుగా బంధువులు,స్నేహితులు చుట్టుప్రక్కల వాళ్ళు  అందరూ రావటంవల్ల నిండుగా,కన్నులపండుగగా కల్యాణోత్సవం జరిగింది.హమ్మయ్య,పాతిక ఏళ్లకు భగవంతుని దయవల్ల మొక్కుతీర్చుకోగలిగాను అనుకుంది స్వప్న.  
    

No comments:

Post a Comment