Friday 13 March 2015

గోళ్ళు అందంగా ఆరోగ్యంగా

                                        పదిరోజులకొకసారి గోళ్ళను కత్తిరించి చక్కటి ఆకృతినివ్వాలి.దీనివల్ల గోళ్ళు అందంగా ఉండటమే కాకుండా గోళ్ళల్లో పేరుకున్న మురికి పోతుంది.గోరువెచ్చటి నీళ్ళల్లో నిమ్మరసం పిండి పాదాలు,చేతులు 10 ని.ల చొప్పున పెడితే శుభ్రపడతాయి.తర్వాత పొడి వస్త్రంతో తుడిచి గోరు వెచ్చని బాదం నూనె తీసుకుని గోళ్ళకు మర్దన చేస్తే గోళ్ళు ఆరోగ్యంగా పెరుగుతాయి.గోళ్ళరంగు వేసుకోవటం నేటి ఫ్యాషన్ అయినా అదేపనిగా వేసుకోవటం వల్ల గోళ్ళపై ఉండే సహజ నూనెలు పోయి పొడిబారి రంగు మారటం జరుగుతుంది.అలా జరగకుండా ఉండాలంటే వారంలో ఒకటి,రెండు రోజులైనా గోళ్ళరంగు వేసుకోకపోవటమే మంచిది.గోళ్ళరంగు తొలగించటానికి ఎసిటోన్ లేని రిమూవర్ ను ఉపయోగిస్తే గోళ్ళు దెబ్బతినకుండా ఉంటాయి.

No comments:

Post a Comment