Monday 9 March 2015

తేటగీతికల్లాగా......

                                                    అనూష ఇంటికి బంధువులు వచ్చారు.వాళ్ళతోపాటు వాళ్లకు తెలిసిన ఒకామెను తీసుకొచ్చారు.ఆమె మాటల సందర్భంలో వాళ్ళ ఊరు నుండి ఉద్యోగరీత్యా కొంతమంది ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు రాజధానికి,కొంతమంది రాజధాని కాబోయి ఆగిపోయిన నగరానికి వచ్చారట.వాళ్ళల్లో ఇంతకు ముందు రాజధానికి వెళ్ళిన వాళ్ళకన్నా ఈ నగరానికి వచ్చినవాళ్ళు తేటగీతికల్లాగా ఉన్నారని చెప్పింది.అంటే ఏమిటండీ?అంటే ఆక్కడి నీళ్ళకన్నా ఇక్కడి నీళ్ళు మంచిగా ఉంటాయి కనుక తేటగా అంటే మంచి రంగు వస్తారని చెప్పింది.ఆవిడ మాటలు మొదట వినగానే తేట గీతి పద్యం గుర్తొచ్చింది.తేటగీతికల్లాగా మనుషులు ఉండటమేంటి?అనుకుంది.చివరికి ఆమె భలే విశ్లేషణ ఇచ్చింది.   

No comments:

Post a Comment