Tuesday 31 March 2015

స్వేచ్చలేని బ్రతుకు

                                                           చాలా సంవత్సరాల తర్వాత పంకజాక్షి మామ్మ కనిపించింది.మామ్మా!బాగున్నావా?అని పలకరించగానే బాగానే ఉన్నాను అంటూనే బొత్తిగా స్వేచ్చలేని బ్రతుకు అయిపోయింది అంది.
అదేమిటి?అంటే బాధపడటం తప్ప సమాధానం లేదు.చిన్నప్పుడే రెండో పెళ్ళి వాడికిచ్చి పెళ్ళి చేశారు తల్లిదండ్రులు.
జీవితమంతా మొదటిభార్య కూతుర్ని పెంచి పెద్దచేయటంతోనే సరిపోయింది.దానికితోడు పంకజాక్షి మామ్మకు పిల్లలులేరు.ఉన్న ఆస్థి మొత్తం ఆమెకు లేకుండా మరుదులు,అత్త,మామ కలిసి భర్తతో బలవంతాన మొదటి భార్య కూతురికి చెందేటట్లు రాయించి కూతురికి పెళ్ళి చేశారు.తర్వాత భర్త చనిపోయాడు.తండ్రి చనిపోగానే కొంత పొలం అమ్మేసి పట్టణంలోఇల్లు కట్టి కూతురు అక్కడే కాపురం పెట్టింది.చేసేదిలేక ఆమెకు,ఆమె పిల్లలకు చాకిరి చేస్తూ ఈమె కూడా పట్టణంలో వాళ్ళతో పాటు ఉండవలసి వచ్చింది. తనకంటూ స్వతంత్రంగా రూపాయి కూడా వాడుకోవటానికి    లేదు.కూర్చోమంటే కూర్చోవాలి.నిలబడమంటే నిలబడాలి అన్న చందంగా తయారైంది బ్రతుకు.ఇవన్నీ నోరు తెరిచి చెపితే నిలువనీడ కూడా ఉండదేమోనని మళ్ళీ భయం.ప్చ్,ఇలాంటివాళ్ళు ఎందరో.

No comments:

Post a Comment