Tuesday 17 March 2015

పరిక్షల సమయంలో.....

                                             పరిక్షల సమయంలో పెద్దవాళ్ళుగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.పిల్లలు రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తుంటారు.దీనితో ఉదయం అల్పాహారం తినటం మానేస్తుంటారు.    అల్పాహారం మెదడుకు శక్తినిస్తుంది కనుక పిల్లలు తప్పనిసరిగా తినేట్లు చూడాలి.కనీసం ఆరు,ఏడు గంటలన్నా  నిద్రపోయేలా చూడాలి.నిద్ర సరిపోకపోతే తలనొప్పి,ఏకాగ్రత లేకపోవడం,చదివింది గుర్తులేకపోవడం   జరుగుతుంటుంది.అప్పుడు ప్రయోజనం ఉండదు కదా.అందుకే ఆందోళన పడకుండా ప్రశాంతంగా మధ్యమధ్యలో 2,3 గం.లకొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలడం కాసేపు అటు,ఇటు నడవడం వల్ల కొత్త శక్తి వచ్చినట్లు చురుగ్గా ఉండగలుగుతారు.పది ని.లు విరామం తీసుకున్నట్లు ఉంటుంది.మంచినీళ్ళుపండ్లరసాలు,సమయానికి తగినట్లుగా ఆహారాన్ని ఇస్తూ చక్కగా చదువుకునేలా  ప్రోత్సహించాలి.చదవడం ఒక ఎత్తయితే ,పరిక్ష చక్కగా వ్రాయడం ఒక ఎత్తు.పరిక్ష రాసేటప్పుడు కూడా పేపరు ఇవ్వగానే హడావిడిగా వ్రాయడం మొదలు పెట్టకుండా ఒక 5 ని.లు ప్రశాంతంగా కళ్ళుమూసుకుని ఆతర్వాత వ్రాయడం మొదలుపెడితే చక్కగా వ్రాయగలుగుతారు.పరిక్షల సమయంలో కాకుండా ముందునుండే ఈవిధంగా పిల్లలకు పెద్దవాళ్ళు తర్ఫీదునివ్వాలి.పిల్లలు చక్కగా చదువుకుని ప్రయోజకులైతేనే కదా పెద్దవాళ్ళకు సంతోషం కనుక తల్లిదండ్రులు ఎన్ని పనులున్నాపిల్లలపట్ల శ్రద్ధ వహించాలి.తల్లో,తండ్రో ఎవరికి వీలైతే వాళ్ళు తప్పనిసరిగా పరీక్షాకేంద్రానికి పిల్లలను వెంటబెట్టుకుని తీసికెళ్ళి తీసుకురావాలి.ఇద్దరికీ వీలుకాకపోతే పెద్దవాళ్ళైనా వెళ్ళాలి.పిల్లలు ఉత్సాహంగా,చురుగ్గా ఉంటారు.     

No comments:

Post a Comment