Friday 13 February 2015

దవడ కండరం బిగించి మింగేసేలా..........(తొమ్మిదో భాగం)

                                మాఘమాసంలో వెంకటేశ్వరస్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు జరిగాయి.జమిందారుగారి కుటుంబాన్ని బ్రహ్మోత్సవాలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు.మిగిలిన అన్ని రోజులు వీలుపడకపోయినా  మహామాఘి రోజున జరిగే కళ్యాణమహోత్సవంలో తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పటం వలన రాణీ మాలినీ దేవి దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.స్వామి,అమ్మవార్ల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది.ఇసుక వేస్తే రాలదేమో అన్నట్లుగా భక్తులు కల్యాణానికి హాజరయ్యారు.ఆసందర్భంగా భక్తులందరికీ భోజన ఏర్పాట్లు చేశారు.
                           కల్యాణంలో పాల్గొన్నదంపతులు తప్పనిసరిగా భోజనం చేయాలి కనుక రాణీ మాలినీ దేవి దంపతులు భోజనం చేయటానికి వెళ్లారు.కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు.స్వామివారిసేవ చేయటానికి అంటే భోజన ఏర్పాట్లు పర్యవేక్షించటానికి,వడ్డన కార్యక్రమాలు లాంటివి ఎవరైనా చేయవచ్చు కనుక ప్లీడరు తమ్ముడు అంతకు ముందే రాణీ మాలినీ దేవిని చూచి ఉండటంవల్ల తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వస్తారని అన్నకు చెప్పి తీసుకువచ్చాడు కాబోలు.రాణీ మాలినీ దేవి దంపతులు ప్రక్కప్రక్కనే కూర్చుని భోజనం చేస్తున్నారు.మధ్యలో తలపైకెత్తేసరికి కొంచెం దూరంలో వీళ్ళిద్దరినీ మార్చిమార్చి చూస్తూ ఇద్దరు కనిపించారు. అందులో ఒకతను చాలాకోపంగా చూస్తూ కనిపించాడు.
                      (తరువాయి భాగం రేపటి పోస్టులో)    

No comments:

Post a Comment