Saturday 7 February 2015

దవడ కండరం బిగించి మింగేసేలా.........(ఐదవ భాగం)

                                                          రాణీ మాలినీ దేవి చదువు పూర్తయ్యేటప్పటికి జమిందారుగారు పెళ్ళి సంబంధాల వేటలో పడ్డారు.ఆయన ఎంత అపురూపంగా పెంచుకున్నారో అదే విధంగా వచ్చే అల్లుడు కూడా  చూచుకోవాలనే  ఉద్దేశ్యంతో చుట్టుప్రక్కల ఊళ్ళన్నీ జల్లెడ పట్టి గాలించిన విధంగా వెదికి,ఎన్నోరకాలుగా పరీక్షించి ఎట్టకేలకు ఒక సంబంధం కుదుర్చుకున్నారు.ఎలాగైతేనేం ఆయన అనుకున్న విధంగానే మంచి వరుడు దొరికాడు.జమిందారుగారు రంగరంగ వైభవంగా రాణీ మాలినీ దేవి వివాహం జరిపించారు.ఏ తల్లిదండ్రులైనా తామెంత అపురూపంగా పెంచామో అంతకన్నా బాగా చూచుకోగలిగే భర్త కూతురికి లభించాలని కోరుకుంటారు.అలాగే జమిందారుగారు ముందుగా అనుకున్నట్లుగానే రాణీ మాలినీదేవికి మంచి భర్త లభించాడు.అనతికాలంలో ఆఇంట బుల్లి రాణీ,బుల్లి రాజావచ్చి వాళ్ళ ముద్దుమురిపాలతో,ఆటపాటలతో ఇల్లంతా సందడి చేస్తుండగా అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు.
                     (తరువాయి భాగం రేపటి పోస్టులో )
 

No comments:

Post a Comment