Monday 23 February 2015

మట్టిని తాకితే .........

                                        మనకు ఒక్కొక్కసారి ఏ కారణం లేకుండానే చికాకుగా ఉన్నట్లు,మనసుకు ప్రశాంతత         లేనట్లుగా అనిపిస్తుంటుంది.అటువంటప్పుడు పచ్చటి చెట్ల మధ్య కాసేపు తిరిగి మొక్కలకు పాదులు చేయటమో,
 నీళ్ళు పెట్టటమో చేస్తుంటే కాసేపటికి ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది.అసంకల్పితంగానో,పెద్దవాళ్ళు చెప్పటంవల్లో
మనం పైవిధంగా చేస్తుంటాము.నిజంగానే మట్టిని తాకి పనులు చేస్తుంటే మనసు తేలిక పడుతుందని,మట్టిలోఉండే సూక్ష్మజీవులవల్ల మనోల్లాసం కలుగుతుందని ఈరోజే పుస్తకపఠనం ద్వారా తెలిసింది.దిగులుగా ఉందా?అయితే మట్టిని తాకండి.ఒత్తిడితో ఉన్న చికాకు దానంతటదే పరారవుతుందని,మట్టి మనకు ప్రకృతి ప్రసాదించిన వరం అని, పొలం పనులు,తోట పనులు చేసేవాళ్ళు చీకు,చింత లేకుండా హాయిగా ఉండటానికి కారణం మట్టేనని దాని సారాంశం.   

No comments:

Post a Comment