Monday 9 February 2015

దవడ కండరం బిగించి మింగేసేలా ............(ఆరవ భాగం)

                                                    సంతోషంగా కాలం గడిచిపోతున్న సమయంలో జమిందారు గారికి అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు వచ్చి ఆసుపత్రికి వెళ్ళే సమయం కూడా లేకపోవడంతో పరమపదించారు.ఈ హఠాత్పరిణామనికి అందరూ నివ్వెరపోయారు.అందరి మధ్య సంతోషంగా తిరుగుతూ తిరుగుతూ ఉన్నాయన ఇక లేరు అనుకునేసరికి బాధతో అందరి హృదయాలు బరువెక్కాయి.రాణీ విజయలక్ష్మీ దేవిగారి సంగతి చెప్పనవసరం లేదు.ఆమె ఈ విషయాన్ని జీర్ణించుకోలేక సతమతమై చిక్కిశల్యమయ్యారు.రాణీ మాలినీ దేవికి బాధగా ఉన్నా తల్లిని కూడా ఆబాధ నుండి బయట పడెయ్యాలి కనుక గుండె దిటవు చేసుకుని అమ్మ గారికి స్వాంతన వచనాలతో ధైర్యం చెప్పటం మొదలు పెట్టింది.మనుమడు,మనుమరాలు వైద్య వృత్తి చేపట్టి ప్రత్యేకంగా పేదప్రజలకు కూడా సేవచేయాలని జమిందారుగారి సత్సంకల్పం.అందుకని ఆయన కోరిక మేరకు వైద్య వృత్తిని స్వీకరించి జమిందారుగారి సంకల్పం నెరవేర్చాలనే ప్రయత్నంలో ఉన్నారు.జమిందారు గారి జ్ఞాపకాలు వెంటాడుతుండటంతో స్థల మార్పిడి కోసం రాణీ విజయలక్ష్మీ దేవిగారిని తీసుకుని అందరూ విదేశాలకు వెళ్లారు. మరల ఒక పది సంవత్సరాల తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చారు.జమిందారుగారు లేని లోటు తీర్చలేక పోయినా తిరిగి ఆ ఇంట పూర్వపు వైభవం చోటుచేసు కున్నందుకు అందరూ సంతోషించారు.
                   
              (తరువాయి భాగం రేపటి పోస్టులో)




No comments:

Post a Comment