Wednesday 18 February 2015

బంగారు కుంకుమ భరిణె

                                                        విద్యావతి కోడలికి పెళ్ళిలో ముప్పైరెండు గ్రాముల బంగారు కుంకుమ భరిణె పెట్టింది.విద్యావతికి మనవడు పుట్టిన ఆనందంలో బంధువులందరినీ పిలిచి భారీగా విందుభోజనాలు ఏర్పాటు చేసింది.వచ్చిన ఆడవాళ్ళకు బొట్టుపెట్టటానికి గొప్పగా బంగారు కుంకుమ భరిణె బయటపెట్టింది.ఎవరి వీలును బట్టి వాళ్ళు వస్తుంటారు కనుక కొంతమందికి బొట్టు పెట్టిన తర్వాత మనవడు ఏడుస్తుంటే కుంకుమ భరిణె వదిలేసి అత్తాకోడళ్ళు లోపలకు వెళ్లారు.మళ్ళీ వచ్చేసరికి కుంకుమ భరిణె మాయమైంది.ఆ సమయంలో పనివాళ్ళు కూడా అక్కడ లేరు.అందరూ బంధువులే.ఎవరినీ ఏమీ అడగలేని పరిస్థితి.ఏమి చేయాలో,ఏమి మాట్లాడాలో తోచని అయోమయంలో పడిపోయారు.కుంకుమ భరిణె పోయిందని కూడా చెప్పుకోలేక,పిలిచి దొంగతనం అంటగట్టారని తిడతారని కక్కలేక,మింగలేక అన్నట్లు విద్యావతి,కోడలు మిన్నకుండిపోయారు.  

No comments:

Post a Comment