Tuesday 3 February 2015

దవడ కండరం బిగించి మింగేసేలా......(మొదటి భాగం)

                                         ఇది నిజంగా 35సంవత్సరాల క్రితం జరిగిన యదార్ధ గాథ మరియు ప్రస్తుత సంఘటన.
రాణీ మాలినీదేవి పేరుకు తగినట్లుగానే అందమైన,జమిందారీ వంశానికి చెందిన ఏకైక గారాబు బిడ్డ.కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నంత అపురూపంగా తల్లిదండ్రులు,వాళ్ళ తల్లిదండ్రులు,పరివారము కూడా క్రింద దించే వాళ్ళు కాదు.రాణీ మాలినీ దేవి పెరిగి పెద్దదవుతున్నకొద్దీ అందంతో పాటు తెలివికలది కనుక చదువులో కూడా రాణించటం మొదలెట్టింది.ఆమెను ఇంట్లోవాళ్ళేకాక ఊరివారందరు కూడాఎంతో ఇష్టపడేవాళ్ళు.కళాశాలకు చాలా నిరాడంబరంగా
ఫలానా అని తెలిసినవాళ్ళెవరయినా చెబితే తప్ప తెలియనంత సాదాసీదాగా వెళ్ళి వస్తుండేది.ఎందుకంటే రాణీమాలినీ దేవి తల్లి రాణీ విజయలక్ష్మీ దేవికి తన అందమైన కూతుర్నిఎవరైనా మోహిస్తారేమోనని భయం.
                                    అనుకున్నట్లుగానే ఒకసారి ప్రక్క ఊరి ప్రెసిడెంటుగారబ్బాయి ప్లీడరు చూచి మామూలు అమ్మాయనుకుని ఇష్టపడి ఫలానా ఊరిలో అమ్మాయి నచ్చింది.మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం జరిపించమని అమ్మానాన్నలకు చెప్పాడు.మా అబ్బాయికి ఇన్నాళ్ళకు నచ్చినమ్మాయి దొరికింది కదా అనుకుని సంబరపడి వీళ్ళఊరివాళ్ళు కనిపిస్తే మీఊరిలో అందమైన అమ్మాయి చదువుకోవటానికి రోజు కళాశాలకు వెళ్తుందట.కొంచెం ఎవరో కనుక్కుని మా అబ్బాయికి పెళ్ళి సంబంధం కుదర్చమని చెప్పారట.మొదట వాళ్ళకు అర్ధంకాలేదు.అందరినీ అడగ్గా అడగ్గా చివరికి ఫలానా జమిందారుగారమ్మాయని తెలిసింది.
                                                                                                (తరువాయి భాగం రేపటి పోస్టులో)

No comments:

Post a Comment