Tuesday 10 February 2015

దవడ కండరం బిగించి మింగేసేలా............(ఏడవ భాగం)

                                                                జమిందారు గారు ఉన్నప్పుడు జీర్ణోద్ధారణలో ఉన్న దేవాలయాలను పునర్నిర్మించేటప్పుడు,క్రొత్తగా కట్టే ఆలయాలకు ధన రూపేణా,వస్తు రూపేణా ఇచ్చేవారు.ఆయనకు దైవభక్తి ఎక్కువ.రాణీ మాలినీ దేవి కుటుంబం చాలాసంవత్సరాల తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చారు కనుక దైవదర్శనం చేసుకోవటానికి ఆలయాలకు వెళ్ళారు.ఆక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు.ఆలయంలో ఏ పూజ  జరిగినా వీళ్ళ కుటుంబం తప్పనిసరిగా పాల్గొనేది కనుక మీరు ఇక్కడలేని వెలితి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది అని కార్తీక మాసంలో ఫలానా రోజు సత్యన్నారాయణ స్వామి వ్రతంలో తప్పనిసరిగా పాల్గొనాలని పట్టుబట్టారు.సరేనని రాణీ మాలినీ దేవి దంపతులు వ్రతంలో పాల్గొన్నారు.వ్రతంలో పాల్గొన్న వారికి అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు.భోజనం చేయకుండా రాకూడదు కనుక రాణీ మాలినీ దేవి కుటుంబం భోజనానికి కూర్చున్నారు.ఇంతలో అక్కడ ప్లీడరు తమ్ముడు రాణీ మాలినీ దేవి కనిపించేసరికి ఆమె అవునో కాదో సరిగా గుర్తుపట్టక నాలుగైదు సార్లు కాలుకాలిన పిల్లిలా అటూఇటూ తిరిగి రాణీ విజయలక్ష్మి గారితో మాట్లాడుతుండగా చూచి ఆమేనని నిర్ధారణకు వచ్చి మొహం వేలాడేసుకుని ఒకప్రక్కన కూర్చున్నాడు.ఎందుకో అంత బాధ? 
                  (తరువాయి భాగం రేపటి పోస్టులో)   

No comments:

Post a Comment