Saturday 28 February 2015

తెల్లీశ్వరి

                                         ప్రీతమ్ స్నేహితుడికి ఒంగోలు గిత్తలను,జెర్సీ ఆవులను పెంచటం అలవాటు.ఒకసారి మాఇంటికి వచ్చి ఆవులను,గిత్తలను చూడమంటే స్నేహితులందరూ కలిసి వెళ్లారు.పొలాల్లో షెడ్లు వేసి ప్రత్యేకంగా మనుషులను పెట్టి చాలా బాగా చూస్తున్నారని అందరూ వాటిని చూచి ముచ్చటపడ్డారు. వీళ్ళు అందరూ అక్కడ  కూర్చోవటానికి అనువుగా ఏర్పాట్లు చేశారు.అక్కడ కూర్చుని ఉన్నప్పుడు కొన్ని మొక్కలు గుంపుగా షెడ్ల చుట్టురా పెట్టిఉన్నాయి.అవి అంత ముందెన్నడూ చూడలేదు.అవి ఏం మొక్కలోనని ఆరా తీయగా తెల్లీశ్వరి మొక్కలు అని చెప్పారు.పొలాల్లో పాములు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఆ మొక్కలు పెట్టామని అవి ఎక్కడ ఉంటే అక్కడకు పాములు రావని చెప్పారు.వెళ్ళిన వాళ్ళందరికీ తలా ఒక మొక్కఇచ్చారు.సరే,చూద్దామని తెచ్చి వాకిట్లో   పెట్టుకున్నారు.  

No comments:

Post a Comment