Friday 2 January 2015

పాలు తోడెట్టి.......

                                   పారిజాతమ్మ గారికి ఎనభై సంవత్సరాలు.కొడుకు విదేశాల్లో ఉంటాడు.కూతురు         దగ్గరలోనే ఉంటుంది కానీ తల్లీకూతుళ్ళు సఖ్యతగా ఉండరు.డబ్బు మాత్రం కూతురు తీసుకుంటుంది.అమ్మ   నన్నుఎప్పుడూ పోట్లాడి పిచ్చితిట్లు తిడుతుందని అందరికీ,అన్నకు ఏడ్చి చెపుతుంది.తెలియనివాళ్ళునిజమే అనుకుంటారు.వీళ్ళిద్దరికీ గొడవ  ఎందుకులే అని పనివాళ్ళను పెట్టి జాగ్రత్తగా చూచుకోమని కొడుకు  డబ్బు ఇస్తుంటాడు.ఈమధ్య క్రొత్తగా ఒకతన్ని పెట్టి వెళ్ళాడు.అతనికి తెలియక పాలు తోడుబెట్టి రెఫ్రిజిరేటర్ లో పెట్టాడు. పాలు తోడుకుని పెరుగు అయిన తర్వాత పెట్టాలని,లేకపోతే పెరుగు తోడుకోదన్న విషయం పాపం అతనికి తెలియదు.పారిజాతమ్మగారికి అసలే పెరుగు లేనిదే భోజనం చేసినట్లుండదు.భోజనం చేసేటప్పుడు పెరుగు వెయ్యటానికి బదులు పాలతో ఉన్న గిన్నె తీసుకెళ్ళి పెరుగు తోడుకోలేదని చెప్పాడు.ఎందుకు తోడుకోలేదంటే మీరు చల్లగా వేసుకుంటారని పాలు తోడెట్టి ఫ్రిజ్ లో పెట్టానండీ అంతే అన్నాడు.ఇవ్వాళ పెరుగు లేకుండా చేశావు కదరా!అని పెద్ద గొడవ చేసింది కాక భలే వాడిని  పనిలో పెట్టారని అందరికీ చరవాణి ద్వారా చెప్పడం మొదలెట్టింది.   

No comments:

Post a Comment