Tuesday 27 January 2015

ఓరి! నీ దుంప తెగ!

                                            హితేష్ కి ఐదు సంవత్సరాలు.నిమిషకు నాలుగు సంవత్సరాలు.ఇద్దరూఅన్నాచెల్లెళ్ళ పిల్లలు అంటే బావామరదళ్ళు.నిమిష ఇంటికి హితేష్ వచ్చినప్పుడు బావా,బావా అంటూ వెంట తిరిగేది.హితేష్ ఇంటికి నిమిష వెళ్ళినప్పుడు అరేయ్,ఒరేయ్ అని పిలవటం మొదలెట్టింది.అప్పుడు హితేష్ మీ ఇంటికి వచ్చినప్పుడు బావ అని పిలిచేదానివి ఇక్కడకు వచ్చి అరేయ్,ఒరేయ్ అంటున్నావు.అయినా నేను మగాడిని నువ్వు అరేయ్,ఒరేయ్ అనకూడదు.తెలుసా?బావా అని పిలవాలి. అంతే. అలా అయితేనే పలుకుతాను అన్నాడు.నిమిష కూడా తక్కువదేమీ కాదు.నేను అంతే పిలుస్తాను.పలికితే పలుకు లేకపోతే లేదు అంది.వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న పెద్దవాళ్ళు వీడేమో కూస్తంత ఉన్నాడో  లేడో నేను మగాడిని అంటున్నాడు.అదేమో అంతే పిలుస్తా పలికితే పలుకు లేకపోతే లేదు అంటుంది.ఓరి!నీ దుంప తెగ!వీళ్ళప్పుడే ఇన్నిన్ని మాటలు మాట్లాడేస్తున్నారు అని ఆశ్చర్యపోయారు.    

No comments:

Post a Comment