Friday 16 January 2015

గోపూజ విశిష్టత

                                                              గోమాతలో సకల దేవతలు కొలువుంటారని నానుడి.గోమాతను పూజిస్తే సకల దేవతలు ఆశీర్వదిస్తారు.పితృదేవతలు సంతోషిస్తారు.గోవులను లక్ష్మీ సంపదగా భావించి పూజించాలి.గోక్షీరం
అమృతంతో సమానం.గోమూత్రం సర్వరోగ హరమై క్రిమికీటక నాశనకరమై గృహాన్ని పవిత్రం చేస్తుంది.ఆవు నెయ్యితో దీపారాధనకు ఎంతో మంచిది.యజ్ఞంలో,హోమాలలో ఆవునెయ్యికి ప్రాధాన్యం.ఆవుపేడతో ముంగిట్లో కళ్ళాపి చల్లుతారు.అమ్మపాలు తర్వాత ఆవుపాలు ఎంతో పవిత్రమైనవి,పోషకమైనవి.అభిషేకద్రవ్యాలలో ముఖ్యమైనవి ఆవునెయ్యి,పాలు,పెరుగు.ఇలా గోమాతకు సంబందించిన ప్రతిదీ ఎంతో పవిత్రమైనది.ఏకాదశినాడు శుచిగా స్నానంచేసి ఉదయమే గోమాతను పూజిస్తే ఎంతో పుణ్యం.శుక్రవారం గోపూజ ఎంతో మంచిది.ఈరోజు కనుమ,శుక్రవారం,ఏకాదశి అన్నీ కలిసివచ్చినాయి కనుక గోమాతను పూజించటంవల్ల విశిష్ట ఫలితం కలుగుతుంది.
   

No comments:

Post a Comment