Friday 16 January 2015

పంటి నొప్పులు

                                   ఇప్పుడంటే దంత వైద్యశాలలు ఉంటున్నాయి కానీ ఒకప్పుడు ఆకులు అలముల మీదే
ఆధారపడేవాళ్ళు.మధూలిక అమ్మమ్మ ఆకుమందు ఇస్తే పంటినొప్పి మటుమాయమౌతుందని ఆవూరి వాళ్ళ
నమ్మకం.ఎవరికి పిప్పిపన్ను నొప్పి వచ్చినా వచ్చేవారు.మధూలిక ఇదంతా చిన్నతనం నుండి శ్రద్ధగా అమ్మమ్మ వెన్నంటే ఉండి గమనిస్తుండేది.మధూలిక అమ్మమ్మ అక్కడొక ఆకు,అక్కడొక ఆకు పెరటిలోకి వెళ్ళి తీసుకొచ్చి నలిపి కొంచెం పసరు వచ్చిన తర్వాత పిప్పిపన్ను ఉన్నచోట నొక్కి పెట్టుకోమనేది.అలా 3రోజులు పెట్టుకున్న తర్వాత పంటినొప్పి మటుమాయమయ్యేది.  

No comments:

Post a Comment