Sunday 25 January 2015

ప్రణతోస్మి దివాకరం

                                ఈరోజు రధసప్తమి అంటే సూర్యభగవానుడు ఆవిర్భవించిన పవిత్రమైన రోజు. మాఘసప్తమినే
రధసప్తమి అంటారు.ఈరోజున సూర్యుని రధము ఉత్తరదిశవైపు ప్రయణిస్తుంది.సూర్యభగవానుడు సమస్త మానవాళికి జీవనప్రధాత.గ్రహాధిపతి.హరిహర బ్రహ్మ స్వరూపుడు.ఆరోగ్యప్రధాత.వేకువఝామునే జిల్లెడుఆకులు,రేగుపళ్ళు తలపై ,భుజాలపై పెట్టుకుని స్నానంచేసి,ఆవుపాలతో పాయసం వండి చిక్కుడు ఆకుల్లో సూర్యుడికి తులసిమొక్క దగ్గర నివేదన పెడితే ఎంతో మంచిది.కొంతమంది చిక్కుడుకాయలు,రేగుపళ్ళతో రధం తయారు చేస్తారు.ఆంధ్రరాష్ట్రంలో పురాతన సూర్యదేవాలయాలు రెండు వున్నాయి.ఒకటి అరసవల్లిలోని సూర్యనారాయణ దేవాలయము.అందరికీ తెలిసినదే.రెండవది విజయవాడ దగ్గరలోఉన్న పోరంకి గ్రామంలోని శ్రీ ఆంజనేయ భవానీ శంకర "సూర్యనారాయణ" దేవాలయం..రధసప్తమి సందర్భంగా మనందరికీ ఆయురారోగ్యఐశ్వర్యాలను ప్రసాదించమని సూర్యభగవానుని ప్రార్ధిస్తున్నాను.

No comments:

Post a Comment