Monday 19 January 2015

లక్షా తొంభై అనుమానాలు

                                                                          ఇంతకు ముందు రోజుల్లో అందరూ పొలాల్లోవైనా,పెరటిలోవైనా కూరగాయలు కానీ,పండ్లు కానీ,ఆకుకూరలైనా,పండుగ వచ్చిందంటే పిండివంటలైనా ఎంతో ఆప్యాయంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేవారు.కొన్ని కుటుంబాలలో తప్ప ఆ ఆప్యాయతానురాగాలే కరువైపోయాయి.వాళ్లకు,వీళ్ళకు పంపే బదులు అమ్ముకుంటే పోలా!అనుకునేవాళ్ళే ఎక్కువైపోయారు.ఒకవేళ ఎవరైనా పంపినా అమ్మో! వీళ్ళకు మనతో ఏమి అవసరముందో?మన నుండి ఏమి ఆశిస్తున్నారో?లేకపోతే వీళ్ళకు ఏమి దోషముందో?అది పోవటానికి ఇలా ఇస్తున్నారేమో?ఎవరో ఒకళ్ళకి దానం ఇవ్వమని ఎవరైనా చెప్పారేమో?ఇలా లక్షా తొంభై అనుమానాలు మనసులో మెదులుతున్నాయి.ఇక పిండి వంటలు కూడా నువ్వులు వేస్తారు కనుక అమ్మో!అవితీసుకుంటే మనకు ఏదైనా పట్టుకుంటుందేమో?అనే ఆలోచనలు,అనుమానాలుఎక్కువైపోయాయి.          

No comments:

Post a Comment