Saturday 22 November 2014

దోసెలు - రకరకాలు

1)   బియ్యం - 2 కప్పులు
   పెసరపప్పు - 3/4 కప్పు
   మినప్పప్పు - 1/4 కప్పు
   మెంతులు - కొంచెం
ఉప్పు - సరిపడా
                                                            వీటన్నింటినీ 5 గం లు నానబెట్టి గరిటె జారుగా,మెత్తగా పిండి రుబ్బి దోసె వెయ్యాలి.ముందుగా నూనె వెయ్యకుండా దోసె వేసి చివరలో నూనె చుట్టూ,మద్యలో అక్కడక్కడవెయ్యాలి.దోసె వెయ్యగానే ఉల్లి,పచ్చిమిర్చి,కొత్తిమీర,టొమాటో చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైనవెయ్యాలి.ఆవిరికి పైన మూత పెట్టాలి.కాలిన తర్వాత దోసెను చుట్టలా మడవాలి.పచ్చి మిర్చి అల్లం చట్నీతో తింటే బాగుంటుంది.

2)      బియ్యం - 4 కప్పులు ,మినప్పప్పు - 1/2 కప్పు,పెసరపప్పు - 1/4 కప్పు,పచ్చి శనగపప్పు - 1/4 కప్పు,మెంతులు - 1 స్పూను అన్నీకలిపి నానబెట్టి మెత్తగా రుబ్బి6 గం.లు తర్వాత దోసె వేసుకుంటే దోసె బంగారు వర్ణంలో కంటికింపుగా ఉంటుంది.
    
3)బియ్యం -2 కప్పులు,మినప్పప్పు - 1 కప్పు,మెంతులు - 1 స్పూను,అన్నీ నానబెట్టి మెత్తగా రుబ్బి ఒకపూట పులవనిచ్చి పిండి పొంగిన తర్వాత దోసె వేసుకుంటే బాగుంటుంది.

4)బియ్యం -1 కప్పు,మినప్పప్పు - 1 కప్పు కలిపి నానబెట్టి మెత్తగా కొంచెం గట్టిగా రుబ్బి ఉల్లి,పచ్చి మిర్చి ముక్కలు వేసి 5,6 గం.లు తర్వాత పెనంపై నూనె వేసి పిండిని చేతితో గుండ్రంగా,కొంచెం మందంగా దోసె వెయ్యాలి.పైన మూతపెట్టి కాలిన తర్వాత రెండోవైపు తిరగెయ్యాలి.
    
    5 ) బియ్యం - 3 కప్పులు
       మినప్పప్పు - 1 కప్పు
       మెంతులు - కొంచెం 
       టొమాటోలు - 2
       కొత్తిమీర - 1 కట్ట
      కరివేపాకు - కొంచెం
      ఉప్పు - సరిపడా
      జీరా - కొంచెం  
పప్పులు,బియ్యం,మెంతులు నానబెట్టి మెత్తగా రుబ్బి టొమాటో,పచ్చిమిర్చి,కొత్తమీర,కరివేపాకు,ఉప్పువేసి రుబ్బాలి.అప్పటికప్పుడు దోసె వేసుకోవచ్చు.

No comments:

Post a Comment