Saturday 1 November 2014

వృద్ధాప్యంలో ఒకరికి ఒకరు

                       శ్యామసుందరరావు గారు,రాజేశ్వరమ్మ గారు దంపతులు.ఒకరికి ఎనభై సంవత్సరాలు.ఒకరికి డెభై సంవత్సరాలు.ఎంతో ప్రేమ,ఆప్యాయతలతో ఒకరికొకరు తోడుగా ఎక్కడకు వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్తుంటారు.ఏపని చేసినా ఇద్దరూ కలిసే చేస్తుంటారు.ఎప్పుడైనా అర్ధరాత్రప్పుడు భార్య ఎక్కడైనా నొప్పిగా ఉంది అంటే భర్త నొప్పిగా ఉందా?నేను మందు రాస్తానుండు అనటం,భర్త కాళ్ళు నొప్పంటే నేను కాళ్ళు పడతానుండు అనటం వీళ్ళ మాటలు విన్పించి తల్లి,తండ్రికి ఏమైందో అని హడావిడిగా నిద్ర లేచి వచ్చిన కొడుకు ,కోడలికి వీళ్ళను చూచి ముచ్చటేసేది.
వయసులో ఉన్నప్పుడు ప్రేమగా ఉన్నాబాధ్యతలతో ఇంతగా పరితపించటానికి సమయం కూడా ఉండదు కనుక అసలైన ప్రేమ హృదయంలోనుండి బయటపడేది,మానసికంగా ఒకరికి ఒకరు దగ్గరయ్యేది కూడా ఈవయసులోనే.
వీళ్ళకంటే కొడుకు,కోడలు దగ్గరున్నారు.పిల్లలు దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఎంత పనివాళ్ళు చేసినా కొన్ని పనులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వృద్దాప్యంలో కూడాఎంతో సంతోషంగా గడపడం అదృష్టంగా భావించాలి.

No comments:

Post a Comment