Tuesday 4 November 2014

సౌందర్య చిట్కాలు

1) మెరిసే చర్మం కోసం 5 స్పూనుల తేనెకు 2 స్పూనుల నిమ్మరసం,2 స్పూనుల పాల మీగడ చొప్పున బాగా కలిపి
  చర్మానికి పట్టించాలి.అరగంట తర్వాత తొలగించాలి.
2) పొడి చర్మ తత్వం కలవారు 2 స్పూనుల తేనెకు కొద్దిగా నిమ్మరసం,నాలుగైదు చుక్కల వెజిటబుల్ నూనె కానీ, ఆలివ్ నూనె కానీ కలపాలి.ఇది చక్కని మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది.
3) పాలమీగడ,శనగపిండి సరిపడా కలిపి శరీరానికి పట్టించి కొంచెం సేపటి తర్వాత స్నానం చేస్తే చర్మం చలికాలంలో
చక్కగా మెరుస్తూ పొడిబారకుండా ఉంటుంది.ఇది ఏ చర్మతత్వం కలవారికైనా బాగుంటుంది.
4 ) కారట్ ఒకటి మిక్సీలో వేసి రసం త్రాగి,వచ్చిన పిప్పిలో తేనే,పాలు కలిపి ముఖానికి,శరీరానికి పట్టించాలి,20 ని.ల తర్వాత కడిగేయాలి.   

No comments:

Post a Comment