Tuesday 18 November 2014

అమ్మమ్మ కరివేపాకు కారం

పచ్చి శనగపప్పు  - 2 కప్పులు
మినప్పప్పు  - 1 కప్పు
జీలకర్ర  - చారెడు
కళ్ళు ఉప్పు (క్రిస్టల్ సాల్ట్ )  - 1 కప్పు
వెల్లుల్లి రెబ్బలు - గుప్పెడు
ఎండు మిర్చి - గుప్పెడు
చింతపండు - నిమ్మకాయంత  
కరివేపాకు - 4 గుప్పెళ్ళు
నెయ్యి - 4 స్పూనులు
                                            ముందుగా మినప్పప్పు,శనగపప్పు కడిగి ఒక వస్త్రంలో ఆరబోయాలి.వేరువేరుగా నేతిలో అన్నీ వేయించుకోవాలి.శనగపప్పు మిక్సీలో వేసి తీసి జల్లించాలి.మినప్పప్పు కూడా మిక్సీలో వేసిన తర్వాత జల్లించాలి.నేతితో వేయించిన ఎండు మిర్చిమిక్సీలో వేసి నలిగిన తర్వాత జల్లించగా మిగిలిన నూక కూడావేసి మెత్తగా  చెయ్యాలి.వెల్లుల్లి,చింతపండుఉప్పు,జీలకర్ర కూడా మిక్సీలో వెయ్యాలి.కరివేపాకు ఎక్కువ నూనె వేసి నాన్ స్టిక్ పాన్ లో వేయించాలి.కరివేపాకు మిక్సీలో వేసి మెత్తగా నలిగిన తర్వాత అన్నీ ఒకగిన్నెలో వేసి కలిపి మళ్ళీ మొత్తం ఒకసారి మిక్సీలో వెయ్యాలి.ఉప్పు సరిచూసుకుని అవసరమైతే కొంచెం వెయ్యాలి.అంతే ఘుమఘుమలాడే
అమ్మమ్మ చెప్పిన కరివేపాకు కారం రెడీ.ఇది ఇడ్లీ,దోసె,వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది.ఒకసారి కష్టపడితే నెల,నెలాపదిహేను రోజులవరకు నిల్వ ఉంటుంది.గాలి చొరబడని సీసాలో అయితే వాసనపోకుండా అయిపోయే వరకూ మంచి వాసన వస్తుంటుంది.

No comments:

Post a Comment